క‌రోనా దెబ్బ‌కు నాని సినిమా ప్లాన్ మారింది!

క‌రోనా ఎఫెక్ట్ జ‌న జీవితాన్ని అస్త‌వ్య‌స్తం చేస్తోంది. మిగ‌తా వాటితో పోలిస్తే క‌రోనా ప్ర‌భావం సినీ ఇండ‌స్ట్రీని కుదిపేస్తోంది. సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. సినిమా థియేట‌ర్లు బంద్ అయ్యాయి. క‌రోనా ప్ర‌భావం మ‌రో నెల వుండేలా క‌నిపిస్తోంది. దీంతో సినిమాల షూటింగ్‌ల షెడ్యూల్స్ మొత్తం మారాల్సిన ప‌రిస్థితి. దాంతో సినిమా షూటింగ్‌ల షెడ్యూల్స్‌ని మార్చాల్సిన ప‌రిస్థితి.

ఈ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని తెలియ‌క నేచుర‌ల్ స్టార్ నాని త‌న లేటెస్ట్ చిత్రం `శ్యామ్ సింగ్‌రాయ్‌` ‌ని డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే తాజాగా ఆ డేట్‌ని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కి మార్చిన‌ట్టు తెలిసింది. నాని హీరోగా `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ `శ్యామ్ సింగ్‌రాయ్‌` చిత్రాన్ని నాని బ‌ర్త్‌డే (ఫిబ్ర‌వ‌రి 24)న ప్ర‌క‌టించారు.

అయితే ముందు అనుకున్న షెడ్యూల్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా మారిపోవ‌డం, ఆల‌స్యం అవుతుండ‌టంతో చిత్ర బృందం తాజాగా ఈ చిత్రాన్ని స‌మ‌ర్ బ‌రిలో రిలీజ్‌కు రెడీ చేస్తున్న‌ట్టు తెలిసింది.