క‌రోనా ఎఫెక్ట్: `వ‌కీల్‌సాబ్` రిలీజ్ రెన్నెళ్లు వెన‌క్కి?

క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ప‌లు చిత్రాల‌ షూటింగ్‌ల‌ని నిర్మాణ సంస్థ‌లు నిలిపివేశాయి. ప్ర‌భాస్ చివ‌రి నిమిషంలో మ‌న‌సు మార్చుకుని అర్థాంత‌రంగా జార్జియా షెడ్యూల్‌ని మ‌ధ్య‌లోనే పూర్తి చేసి తిరుగు ముఖం ప‌ట్టారు. చిరుతో పాటు అంద‌రూ షూటింగ్‌లని నిలిపి వేశారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న `వ‌కీల్‌సాబ్‌` షూటింగ్‌ని కూడా ఆపేశాడు.

అయితే దీని కార‌ణంగా సినిమా రిలీజ్ రెన్నెళ్లు వెన‌క్కి వెళ్లే ప్ర‌మాదం వుంద‌ని తెలుస్తోంది. అన్నీ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగితే `వ‌కీల్‌సాబ్‌` చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం రెండు వారాల పాటు స్కూల్స్‌, థీయేటర్స్ మూసి వేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. షూటింగ్‌లు కూడా నిలిపి వేయాల‌ని కోర‌డంతో అన్నీ బంద్ చేశారు.

మ‌ళ్లీ షూటింగ్‌లు మొద‌లైతే ప‌వ‌న్ క్రిష్ సినిమాకి వెళ్లాలి. దీంతో `వ‌కీల్‌సాబ్‌` షూటింగ్ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని, జూలై వ‌ర‌కు రిలీజ్ పోస్ట్ పోన్ కానుంద‌ని ఇండ‌స్ట్రీ టాక్‌.