కోలీవుడ్ పై కన్నేసిన అనుపమా పరమేశ్వరన్

Anupama Parameshwaran

అనుపమా పరమేశ్వరన్‌ తెలుగులో ‘అఆ’ తో పరిచయమై త్వరగానే హీరోయిన్ పాత్రలు అందుకుంది. కానీ కొద్దిగా సక్సెస్ రేట్ తక్కువనే చెప్పాలి. ఇటు తెలుగులో తాజాగా వచ్చిన ‘రాక్షసుడు’ సినిమా హిట్ అయింది. దాంతో తెలుగుతో పాటు తమిళం అవకాశాలు కూడా వస్తున్నాయి. తెలుగులో ఓ మాదిరి సంఖ్యా సినిమాలు చేసింది. దీంతో ఇక పై కోలీవుడ్ పై కన్నేసింది.

చాలా కాలం తరువాత తమిళంలో ఆమెకి రెండో అవకాశం వచ్చింది. అది కూడా తెలుగులో హిట్ అయిన ‘నిన్ను కోరీ’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఇందులో నటి అనుపమా పరమేశ్వరన్‌ నాయకిగా నటించే అవకాశం వరించింది. అధర్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది.ఇకపై ఎక్కువగా
కోలీవుడ్ పై దృష్టి సారించాలని అనుకుంటోంది అనుపమ.