కొర‌టాల శ్ర‌మంతా వృధా చేసేశారా?

చిరంజీవి – కొర‌టాల శివ‌ల ప్రాజెక్ట్ ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ని త‌ల‌పిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి ఏదో ఒక ట్విస్ట్ ఈ టీమ్‌ని వెంటాడుతోంది. కెమెరామెన్ విష‌యంలో వివాదం కారణంగా వార్త‌ల్లో నిలిచిన ఈ చిత్రం వ‌రుస ట్విస్ట్‌ల‌తో థ్రిల్ల‌ర్ సినిమాలా సాగుతోంది. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రంలోని కీల‌క అతిథి పాత్ర కోసం ముందు రామ్‌చ‌ర‌ణ్‌ని అనుకుని `ఆర్ ఆర్ ఆర్‌` కార‌ణంగా ఆ స్థానంలో మ‌హేష్ ఒప్పించాల‌ని ఆ బాధ్య‌త‌ల్ని కొర‌టాల శివ‌కు అప్ప‌గించారు.

మ‌హేష్‌తో కొర‌టాల శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ ల‌ని అందించాడు. దాంతో కొర‌టాల అంటే మ‌హేష్‌కి మంచి న‌మ్మ‌కం కుదిరింది. అది గ‌మ‌నించిన చిరు అతిథి పాత్ర కోసం మ‌హేష్‌ని రంగంలోకి దింపాల‌ని ఆ బాధ్య‌త‌ల్ని కొర‌టాల‌కు అప్ప‌గించార‌ట‌. ముందు మ‌హేష్ అతిథి పాత్ర‌లో న‌టించ‌డం ఏంట‌ని న‌మ్ర‌త స‌సేమిరా అందంట‌. కొర‌టాల మ‌హేష్ ని క‌న్విన్స్ చేయ‌డంతో మ‌హేష్ న‌మ్ర‌త‌ని ఒప్పించాడ‌ట‌.

అంతా బాగానే వుంది ఇక షూటింగ్ మొద‌లుపెడ‌దాం అనుకుంటున్న త‌రుణంలో తాజాగా చిరు మ‌ళ్లీ రామ్‌చ‌ర‌ణ్ అయితేనే బాగుంటుందేమో అని కొర‌టాల వ‌ద్ద డౌట్ రైజ్ చేశాడ‌ట‌. దీంతో కొర‌టాల చేసిన ప్ర‌య‌త్నం అంతా వృధా అయిన‌ట్టేన‌ని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంలో కొర‌టాల హ‌ర్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోసారి మెగా క్యాంప్‌లో సినిమా అంటే డైరెక్ష‌న్‌నే ప‌క్క‌న పెట్టాల‌న్న అస‌హ‌నానికి కొర‌టాల లోనైన‌ట్టు ఇన్‌సైడ్ టాక్‌.