`ఉప్పెన` టీమ్‌కు షాకిచ్చిన విజ‌య్ సేతుప‌తి!

`ఉప్పెన` టీమ్‌కు షాకిచ్చిన విజ‌య్ సేతుప‌తి!

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్ర ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర చేస్తున్నాడు.

సినిమా టాక్ బాగుంది. ఏప్రిల్ 2నే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. స‌డెన్ గా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌ల‌డంతో ఈ చిత్ర రిలీజ్‌ని చిత్ర బృందం వాయిదా వేసింది. తెలుగుతో పాటు త‌మిళంలోనూ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే మైత్రీ వారి ప్లాన్‌కి విజ‌య్ సేతుప‌తి షాకిచ్చాడు. ఈ చిత్రాన్ని త‌మిళంలో రిలీజ్ చేయొద్ద‌ని, తానే రీమేక్ చేస్తాన‌ని రైట్స్ ఇవ్వ‌మ‌ని కోరాడ‌ట‌. ఊహించ‌ని ప‌రిణామానికి కంగుతిన్న మైత్రీ వారు ఓకే అన్న‌ట్టు తెలిసింది.

త‌మిళంలో హీరోగా న‌టిస్తున్న త‌న‌కు `ఉప్పెన‌` ఇబ్బందిగా మారుతుంద‌ని గ్ర‌హించి విజ‌య్ సేతుప‌తి ఇలా మాట మార్చాడ‌ని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని హీరో విజయ్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్‌తో చేయాల‌ని విజ‌య్ సేతుప‌తి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. విజ‌య్‌, విజ‌య్ సేతుప‌తి మంచి మిత్రులు. దీంతో విజ‌య్ త‌న‌యుడిని హీరోగా ప‌రిచ‌యం చేసి ఆ బంధాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుచుకోవాల‌ని చూస్తున్నాడ‌ట‌. జాస‌న్ విజ‌య్ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం కెన‌డాలో చిక్కికుపోయాడు.