‘ఉండి పోరాదే’ సెన్సార్ పూర్తి, ఆగష్టు 31న విడుదల

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ‘ఉండి పోరాదే’ చిత్రంలో తరుణ్ తేజ్ ,లావణ్య హీరోహీరోయిన్లుగా నటించారు. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వం వహించారు. విడుదల అయిన టీజర్, పాటలకి విశేష స్పందన వచ్చింది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ – ” మా ‘ఉండి పోరాదే’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ ఏ పొందింది. సెన్సార్ వారు సింగల్ కట్ కూడా లేకుండా ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా చూశాం అని.. నన్ను మా బృందాన్ని అభినందించారు. ఈ సినిమాలో నటీనటులు అంద‌రూ కొత్త‌వారే అయినా సినిమా క‌థ‌ను నమ్మి ఈ సినిమా నిర్మించాను. చివరి 20 నిముషాలు మన ప‌క్క‌న ఉన్న‌వారిని కూడా మ‌ర్చి పోయేలా సినిమా ఉంటుంది. హీరోహీరోయిన్లు తరుణ్ తేజ్, లావణ్య పోటా పోటిగా న‌టించారు. ఈ సినిమాలో న‌టించిన అంద‌రి కెరీర్లో ఇది బెస్ట్ మూవిగా నిలిచిపోతుంది అనే నమ్మకం ఉంది. అంద‌రూ థియేటర్ లో సినిమా చూసి పెద్ద స‌క్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను“అన్నారు.