ఈ పెద్ద నటుడు కూడా వెబ్ సిరీస్ లోకి…

డిజిటల్ మాధ్యమం అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. సినిమాలతో సమానంగా సినిమా కంటే తక్కువ బడ్జెట్ తో అనుకున్న కథను యధాతధంగా చిత్రీకరించగల స్వేచ్ఛ డిజిటల్ మాధ్యమంలో వచ్చే వెబ్ సిరీస్ లకు ఉన్నాయి. అన్నిటికీ మించి ప్రేక్షకుల ఆదరణ. ఇంకేముంది రోజుకొక్కరు చొప్పున వెబ్ సిరీస్ లలో మేము సైతం అంటూ అడుగు పెడుతున్నారు.

ఆ మధ్య ప్రియాంక చోప్రా, సమంత, ప్రియమణి, ఇప్పుడు తాజాగా జగపతి బాబు సైతం వెబ్ సిరీస్ కి పచ్చ జెండా ఊపారు. ఈ వెబ్ సిరీస్ ను దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కిస్తోంది. ఈ సిరీస్ లో జగపతి బాబు సరసన అమల పాల్ నటించనుంది. హీరోగా కెరీర్ తరువాత విలన్ గా కేరెక్టర్ నటుడిగా జగపతి బాబు స్థిర పడ్డారు. ఆయన డిజిటల్ మాధ్యమంలో కూడా విజయం సాధించాలని కోరుకుందాం.