ఇంకా పాత కాలంలోనే మహేష్ బాబు ఫాన్స్ ? అయినా సూపర్ !

సంక్రాంతి హంగామా మొద‌లైంది. ఈ ఫెస్టివ‌ల్ సీజ‌న్‌లో సూప‌ర్‌స్టార్ హ‌హేష్ `స‌రిలేనే నీకెవ్వ‌రు` సినిమాతో బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే. మ‌రో వారం రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతుండ‌టంతో మ‌హేష్ ఫ్యాన్స్ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. మ‌హేష్ మేనియా ఏ స్థాయాలో వుందో ఆ రేంజ్‌కి త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. దేశ భ‌క్తిని ప్ర‌బోధిస్తూనే మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకునే క‌థ‌, క‌థ‌నాల‌తో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది.

అనిల్ సుంక‌ర‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ గురువారం పూర్త‌యింది. అయితే రిలీజ్ డేట్‌పై ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న న‌డుస్తోంది. అల్లు అర్జున్ టీమ్  `అల‌వైకుంఠ‌పురంలో` చిత్రాన్ని అనూహ్యంగా రెండు రోజుల ముందుగానే రిలీజ్ చేసి ఓపెనింగ్ రికార్డ్స్‌ని సొంతం చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా నైజామ్‌లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. దీంతో స‌ర్వ‌త్రా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇదిలా వుంటే మ‌హేష్ ఫ్యాన్స్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. సినిమా రిలీజ్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

భీమ‌వ‌రంలో మ‌హేష్ ఫ్యాన్స్ ఏకంగా 50 అడుగుల మ‌హేష్ క‌టౌట్‌ని ప‌ద్మాల‌యా థీయేట‌ర్ ముందు ఏర్పాటు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. టీమ్ మ‌హేష్‌బాబు ట్విట్ట‌ర్ సేజీలో పోస్ట్ చేసిన ఈ బిగ్ క‌టైట్ పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనితో పాటు ఏలూరులో 60 ఫీట్ల క‌టౌట్‌, అమ‌లాపురంలో 40 ఫీట్ల క‌టౌట్‌ల‌ని పెట్ట‌బోతున్నామంటూ మ‌హేష్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వ‌రుస పోస్ట్‌లు పెడుతున్నారు. ఒక ఫ్యాన్ ఏకంగా భీమ‌వ‌రం గ‌డ్డ మ‌హేష్ బాబు అడ్డా అని చేసిన పోస్ట్ సోషల్లో మీడియాలో ర‌చ్చ చేస్తోంది.