ఆ న‌టితో ఎఫైర్ నిజ‌మే.. ఒప్పుకున్నజ‌గ్గూభాయ్!

జ‌గ్గూభాయ్ ఉరాఫ్ జ‌గ‌ప‌తిబాబు తాజాగా ఓ క్రేజీ హీరోయిన్‌తో త‌న‌కున్న ఎఫైర్‌ని బ‌య‌ట‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొన్నేళ్ల క్రితం జ‌గ‌ప‌తిబాబు అప్ప‌ట్లో బెంగ‌ళూరుకు చెందిన స్టార్ హీరోయిన్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై జ‌గ‌ప‌తిబాబు ఫాద‌ర్ వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్ చాలా సార్టు మంద‌లించాడ‌ట. అయినా ఆ హీరోయిన్ సోద‌రుడి పేరు చెప్ప జ‌గ్గూభాయ్ త‌ర‌చూ బెంగ‌ళూరు వెళ్ల‌డం.. హీరోయిన్‌ని క‌ల‌వ‌డం అప్ప‌ట్లో క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకున్నారు.

అయితే ఆ త‌రువాత ఆ హీరోయిన్ ఓ జాతీయ పార్టీలో చేర‌డం, ప్ర‌చారం కోసం వెళ్లిన సంద‌ర్భంలో ప్ర‌మాదానికి గురై దారుణంగా మృత్యువాత ప‌డం సీనీ వ‌ర్గాల‌తో పాటు సామాన్య జ‌నాన్ని కూడా తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఆ హీరోయిన్ ఎవ‌రో ఇప్ప‌టికి అర్థ‌మై వుంటుంది య‌స్ సౌంద‌ర్య‌. అప్ప‌ట్లో సౌంద‌ర్య‌కు మించిన హీరోయిన్ తెలుగులో లేదు.. ఇప్ప‌టికి రాలేదు.. రాదు కూడా. అలాంటి సౌంద‌ర్య‌తో త‌న‌కు ఎఫైర్ వుండేదని ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ‌గ‌ప‌తి బాబు వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సౌంద‌ర్య బ్ర‌ద‌ర్ త‌న‌కు బాగా క్లోజ్ అని, ఆ కార‌ణంగానే త‌ర‌చూ బెంగ‌ళూరులోని సౌంద‌ర్య ఇంటికి వెళ్లేవాడిన‌ని, మా మ‌ధ్య మంచి అనుబంధం వుండేద‌ని, అయితే బా బంధాన్ని అంతా అపార్థం చేసుకున్నార‌ని జ‌గ్గూభాయ్ చెప్పాడు. ఇక సౌంద‌ర్య‌తో ఎఫైర్ అంటే అదొక కాంప్లిమెంట్‌గా భావిస్తాన‌ని, మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ వుండేద‌ని, అదే త‌న‌తో నాకున్న ఎఫైర్ అని స్ప‌ష్టం చేశాడు. జ‌గ్గూభాయ్ ఈ టైమ్‌లో ఇన్నేళ్ల త‌రువాత మ‌ళ్లీ సౌంద‌ర్య‌ను గుర్తుచేసుకోవ‌డం ఏంట‌ని సినీ జ‌నం అంటున్నారు.