ఆగష్టు 15 న వస్తున్న అడివి శేష్ ‘ఎవరు’

‘క్ష‌ణం’, ‘అమీ తుమీ’, ‘గూఢ‌చారి’ వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎవ‌రు. బ‌లుపు, ఊపిరి, క్ష‌ణం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. వెంక‌ట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి,
ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.
ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు ఆగష్టు 15 న విడుద‌ల చేస్తున్నారు.