ఛలో
,గీతగోవిందం
,డియర్ కామ్రేడ్
సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు
లో నటిస్తోంది. తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్ రేసులో పరుగెడుతోంది.
ఇటీవల రష్మిక ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను పూర్తి కమర్షియల్ సినిమాలకు చాలా దూరమని చెప్పింది. ఒక సినిమాకు హీరో, హీరోయిన్ ఇద్దరూ ముఖ్యమే. అలా ఉంటేనే సినిమా బాగుంటుంది. అయితే కమర్షియల్ సినిమాల్లో మాత్రం హీరోయిన్ పాత్ర బొమ్మలాగే ఉంటుంది. కమర్షియల్ చిత్రాల్లో నటించమని తమిళం నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి.
అలాంటి సినిమాల్లో నటించేందుకు నేను సిద్ధంగా లేను. సినిమాల సంఖ్య కంటే ఎలాంటి సినిమాల్లో నటించామనేదే నాకు ముఖ్యం. పాటల కోసమే హీరోయిన్ అనే సినిమాల్లో నేను నటించను. నేను ఇలా చెప్పడం చాలా మంది దర్శకులకు నచ్చకపోవచ్చు. నా వైపు నుంచి ఆలోచిస్తే వారికి అర్థమవుతుందని రష్మిక చెప్పింది.