అడివి శేష్ ‘ఎవరు’ ప్రీ లుక్

హీరో అడివి శేష్ కొత్త సినిమా ‘ఎవరు’. ఈ చిత్రాన్ని వెంకట్ రాంజీ పీవిపీ సినిమాస్ బ్యానర్ పై పెరల్ వీ పొట్లూరి, పరం వీ పొట్లూరి మరియు కెవిన్ అన్నే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో అడివి శేష్ కు జోడీగా రెజీనా కాసాండ్రా నటించింది. మరొక పాత్రలో నవీన్ చంద్ర కనిపించనున్నారు.

ఈ చిత్రం ప్రీ లుక్ విడుదల అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ జులై 11 న అంటూ పోస్టర్ వేశారు. విక్రమ్ వాసుదేవ్ అన్న టాగ్ తగిలించుకుని పోలీస్ దుస్తుల్లో సగం ముఖం మాత్రమే కనిపిస్తున్న అడివి శేష్ కనిపిస్తారు.

ఇప్పటికే అడివి శేష్ గత సినిమా ‘గూఢచారి’ చాలా పెద్ద విజయం సాధించింది. అందులోనూ అన్ని విభాగాల్లోనూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందువల్ల ఈ చిత్రం పై అంతటా ఆసక్తి నెలకొంది.