పిల్ల‌ల కోసం స‌మంత‌పై ప్రెష‌ర్?

క్రేజీ క‌థానాయిక‌గా పేరు తెచ్చుకున్న స‌మంత కెరీర్ ఇప్పుడే అస‌లు ట్రాక్‌లోకి మారింది. త‌న క్రేజ్‌కి త‌గ్గ పాత్ర‌ల్లో న‌టిస్తూ ఫీల్ గుడ్ చిత్రాల్ని అందిస్తోంది. అయితే ఈ సంతోషం మరో రెండు మూడేళ్లు మాత్ర‌మే అని స‌మంత తాజాగా ప్ర‌క‌టించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. సామ్ ఏంటీ సినిమాకు ఫుల్ స్టాప్ పెట్ట‌బోతున్న‌ట్టు స్టేట్ మెంట్‌లు ఇవ్వ‌డం ఏంట‌ని అంతా అవాక్క‌వ‌తున్నారు. ఫ్యాన్స్ మాత్రం షాక్‌లో వుండిపోయారు.

ఉన్న‌ట్టుండి స‌మంత ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి అస‌లు కార‌ణం ఏంటీ? ఎందుకిలా మాట్లాడుతోంద‌ని ఆరా తీస్తే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డ్డింది. సామ్‌, చై 2017 అక్టోబ‌ర్ 7న గోవాలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకున్నారు. దాదాపు వివాహం జ‌రిగి మూడేళ్లు కావ‌స్తున్నా ఇంకా పిల్ల‌ల ఊసే ఎత్త‌డం లేద‌ని అక్కినేని ఫ్యామిలీ నుంచి ఆరాలు, ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయ‌ట‌. సినిమాలు చేసింది చాలు ఇక ఫ్యామిలీని చూసుకో. మాకు మ‌న‌వ‌డో మ‌న‌వ‌రాలో కావాలి అని అడుగుతున్నార‌ట‌. దీంతో స‌మంత తాజా నిర్ణ‌యాన్ని ఇండైరెక్ట్‌గా ప్ర‌క‌టించింద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. మ‌రి దీనిపై నాగ‌చైత‌న్య ఎలా స్పందిస్తాడో చూడాలి.