Telangana Schools: తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో (ఏప్రిల్ 23) ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా ముగియడంతో, రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి.
50 రోజుల పాటు సెలవుల సందడి: విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు మొత్తం 50 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. వేసవి విరామం తర్వాత తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి.
ముందస్తు సెలవులకు కారణం ఇదే.. సాధారణంగా ఏప్రిల్ నెలాఖరు వరకు పాఠశాలలు కొనసాగేవి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ మధ్య నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటుతుండటంతో, విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే సెలవులు ప్రకటించింది.

