ఆదరాబాదరాగా ఎన్నికలు జరిపి బిసిలకు అన్యాయం చేయొద్దు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్న నేపథ్యంలో బిసిలకు అన్యాయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిథి డాక్టర్ దాసోజు శ్రవణ్ కేసిఆర్ కు ఆదివారం ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ పూర్తి లేఖ కింద ఉంది. చదవండి.

 

Dr Sravan Dasoju
Chief Spokesperson
తేది:16.12.2018
శ్రీయుత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణా ముఖ్యమంత్రి గారి సముఖమునకు,

ఆర్యా..

విషయము : పంచాయతీరాజ్ ఎన్నికల్లో బిసి ఉప కులాల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల అమలు చేయుట గురించి.
రెఫరెన్స్ : హైకోర్ట్ ఉత్తర్వులు, రిట్ పిటీషన్ నెంబర్ 20477/2018, తేది.26.06.2018 వ తేదీన గౌరవనీయ ఉమ్మడి ఆంధ్రఫ్రదేశ్ హైకోర్ట్ తీర్పు ఉత్తర్వు అనుసరించి.

మీరు రెండవసారి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మా హృదయ పూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాము.
….

పై విషయాను సారముగా మీతో మనవి చేయునది ఏమనగా పంచాయితీరాజ్ ఎన్నికలలో బీసి ఉప కులాల దామాషా ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు జరపడానికి సమగ్ర బీసీ కుల గణన చేపట్టి ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్ధానం, హైదరాబాద్ నందు వేసిన రిట్ పిటీషన్ నెంబర్ 20477/2018 వేసియుంటిమి. రిట్ పిటీషన్ ను సమీక్షించిన న్యాయస్ధానం తేది 26.12.2018 నాడు హైకోర్ట్ జడ్జ్ శ్రీ ఎంఎస్ రామచంద్రరావు ఆధ్వర్యంలోని ఉన్నత న్యాయస్ధానము, బిసి ఉపకులాల సమగ్ర కులగణన చేపట్టి తద్వారా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చిన సంగతి మీకు విదితమే…

తెలంగాణా పంచాయతీరాజ్ ఆక్ట్ 2018 , సెక్షన్ 17(1) ప్రకారం వెనుకబడిన తరగతులకు, ప్రతి జిల్లాలో జనాభా ప్రాతిపదికన 34 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని పంచాయతీరాజ్ కమీషనర్ నిర్ణయించారు. కాని 2014లో మీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసిల జనాభా 52 శాతం ఉన్నందున జనాభా దామాషా ప్రకారం బీసి-ఎ బిసి-బి బిసి-సి బిసి-డి బిసి-ఈ వర్గాల సామాజిక, ఆర్ధిక స్థితిగతుల పై అధ్యయనం చేసి తద్వారా కులగణన చేపట్టాలని, తదనుగుణంగా రిజర్వేషన్లు కేటాయించాలని, అందుకోసం సమగ్ర కుల గణన చేపట్టాలని మేము ఉన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించాము. దీనికి స్పందించిన ఉన్నత న్యాయస్ధానం శాస్త్రీయ పద్దతిలో సంపూర్ణ కులగణన చేపట్టాలని గతంలో దొర్లిన తప్పులను పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. ఇందుకు గతంలో ఇచ్చిన తీర్పును ఉదహరించింది.
బిసి కులాల కు సంపూర్ణ న్యాయం జరిగేందుకోసం గ్రామ గ్రామాన బిసి ఉపకులాల వారిగా వివరాలు సేకరించి, ప్రజల్లో అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్ధానం, రిట్ పిటీషన్ నెంబర్ 20477/2018 అనుసారముగా తేది 26.12.2018 న తీర్పునిచ్చింది. కాని గడిచిన ఏడు నెలలుగా బీసి ఉపకులాల( బీసి-ఎ బిసి-బి బిసి-సి బిసి-డి బిసి-ఈ) సమగ్ర గణన చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శ్రధ్ద చూపిన దాఖలాలు లేవు.
గతంలో రిజర్వేషన్ల అంశంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును తమ పరిశీలన నిమిత్తం ఇక్కడ పొందు పరుస్తున్నాం.
A Division Bench in Nimmaka Jayaraj V. The Government Of Andhra Pradesh Wherein the Division Bench directed the State to conduct detailed investigation with regard to backwardness of population, collect data, invite objections from general public, analyze the same and then fix the reservation in favour of Backward Classes inacordance with the Constitutional Scheme.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ మీడియా సాక్షిగా క్షమాపణ చెప్పినారు. కాని ప్రభుత్వం మళ్లీ అదే ఎన్నికల కమీషన్ తయారు చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా తూతూ మంత్రంగా బీసి కులగణన చేపట్టే ప్రయత్నం జరగుతున్నట్లుగా మాకు విశ్వసనీయ సమాచారం అందింది. తెలంగాణా రాష్ట్రం అవలంబిస్తున్న ఈ లోపభూయిష్ట విధానంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును సైతం ఉల్లఘిస్తుందని భావిస్తున్నాం.

ఆయా కులాల జనాభా వివరాలను మరియు సామాజిక ఆర్ధిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా బీసీ ఉపకులాల( బీసి-ఎ బిసి-బి బిసి-సి బిసి-డి బిసి-ఈ )కు సక్రమంగా రిజర్వేషన్లు కేటాయించి సమన్యాయం జరిపేందుకు అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం.

జనవరి 10, 2019 వ తేదిలోగా పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం ఉత్తర్వులు ఇచ్చిన నేపధ్యంలో బిసి కుల గణన సక్రమంగా చేపట్టకుండా, సామాజిక స్థితిగతులను శాస్త్రీయంగా అధ్యయనం చేయకుండా ఆదరా బాదరాగా రిజర్వేషన్లు కేటాయిస్తే రాబోయే పంచాయితీ రాజ్ ఎన్నికల్లో బీసి కులాలు ( బీసి-ఎ బిసి-బి బిసి-సి బిసి-డి బిసి-ఈ ) తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
మీ సమాచారం నిమిత్తం తీర్పు అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం…
However, since it is an admitted fact that at ay moment Notification for holding the Elections to the Grampanchayats under the Telangana Panchayath Raj Act, 2018 is likely to be issued, and there could be difficulty for the Court to do anything after such a notification is issued. If the respondents are found late to have not acted properly in matter of reservation of Offices of Sarpanchs for backward classes, and since it is not disputed that the legal position set out above still holds good. And to ensure that the process of reservation for backward classes communities is done in accordance with the aforesaid decisions, I deem it appropriate to direct the respondents to scrupulously follow the method of identification of backward classes voters and population laid down is said decisions including the publication of the results of the survey done by the respondents 5&6 invite objections thereto and then take further steps in the matter before issuing the Election Notification for the ensuing electios for the Grampanchayats in the State of Telangana.
కావున రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించకుండా యథాతథంగా అమలు చేసేందుకు తక్షణమే గ్రామ గ్రామాన బీసి కులాల వారిగా వారి వెనుక బాటు తనాన్ని శాస్త్రయంగా అధ్యయనం చేసి సమగ్ర కులగణన చేపట్టి బిసి ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, తద్వారా బీసీ కులాలన్నింటికి రాజకీయ పరమైన సమన్యాయం చేయాలని కోరుతున్నాం.

ఇట్లు

(డాక్టర్ శ్రవణ్ దాసోజు)
ముఖ్య అధికార ప్రతినిధి, టిపిసిసి.

దీని ప్రతులు :

1. శ్రీయుత ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శాఖా తెలంగాణా ప్రభుత్వము, హైదరాబాద్ గారికి,
2. శ్రీయుత ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, తెలంగాణా ప్రభుత్వం, హైదరాబాద్ గారికి,
3. శ్రీయుత కమీషనర్, పంచాయతీరాజ్ శాఖా తెలంగాణా ప్రభుత్వం, హైదరబాద్ గారికి,
4. సెక్రటరీ, స్టేట్ ఎలక్షన్ కమీషన్, తెలంగాణా ప్రభుత్వం, హైదరాబాద్ గారికి,
5. ది డైరెక్టర్, డైరెక్టోరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిటిక్స్ గారికి,
6. మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణా బ్యాక్ వర్డ్ క్లాసెస్, కోఆపరేటివ్ ఫైనాన్సెస్ కోఆపరేషన్ లిమిటెడ్ గారికి,