తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడ్డ రేవంత్ రెడ్డి కొడంగల్ లో వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ ఓటింగ్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యత చూపించారు. కానీ తొలి రౌండ్ లో ఆయన వెనుకబడ్డారు. అలాగే రెండో రౌండ్ లోనూ రేవంత్ రెడ్డి వెనకంజలో ఉన్నారు. మూడో రౌండ్ లోనూ రేవంత్ రెడ్డి వెనుకబడ్డారు. నాలుగో రౌండ్ లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. నాలుగో రౌండ్ లో 3173 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి నిలిచారు.
అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలుగా ముద్ర పడ్డ నాయకులంతా తొలి, రెండో రౌండ్ ముగిసే సరికి వేల ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పెద్దలీడర్ గా ఉండి సిఎం అభ్యర్థి రేస్ లో ఉన్న జానారెడ్డి నాగార్జున సాగర్ లో వెనుకంజలో ఉన్నారు. ఇక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ కూడా ఆందోల్ లో వెనుకబడ్డారు. ఆయన పైన టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జర్నలిస్టు నేత క్రాంతి కిరణ్ ముందంజలో ఉన్నారు.
ఇక గద్వాలలో డికె అరుణ వెనుకబడ్డారు. అక్కడ ఆమె బంధువు (అల్లుడు వరుస) అయిన కృష్ణ మోహన్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక మహేశ్వరంలో తొలుత కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ముందంజలో ఉన్నా తర్వాత వెనుకబడ్డారు.
నల్లగొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి, సిఎం అభ్యర్థి రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి 2వేల ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. అక్కడ టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి లీడ్ లో ఉన్నారు.
అయితే మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ముందంజలో ఉన్నారు.
మరో సిఎం అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు బట్టి విక్రమార్క సయితం వెనుకంజలో ఉన్నారు. మధిరలో ఆయన వెనుకంజలో ఉన్నారు.

ఆందోల్ లో దామోదర రాజనర్సింహ్మ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ జర్నలిస్టు నేత క్రాంతి కిరణ్ టిఆర్ఎస్ తరుపున పోటీ చేశారు.
హుజూర్ నగర్ లో పిసిసి చీఫ్ ఉత్తమ్ ముందంజలో ఉండగా కోదాడలో ఆయన సతీమణి పద్మావతిరెడ్డి వెనుకంజలో ఉన్నారు. కోదాడలో టిఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ముందంజలో ఉన్నారు.
ఇక బిజెపి నేత కిషన్ రెడ్డి అంబర్ పేటలో 500 పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నారు.

ముషీరాబాద్ లో బిజెపి నేత డాక్టర్ లక్ష్మన్ వెనుకంజలో ఉన్నారు.
నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన భూపాల్ రెడ్డి రెండు రౌండ్లు ముగిసేసరికి 2126 ఆధిక్యంలో ఉన్నారు.