లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల ఫలితాల తీరు గురించి తన సర్వే వివరాలు వెల్లడిస్తూ ఒక ఆసక్తి కరమయిన విషయం చెప్పారు. పోలింగ్ 68 శాతం కంటేఎక్కువయితే వచ్చేది ప్రజాకూటమి అని, తగ్గితే హంగ్ అన్నారు. ఇది ఉత్కంఠ రేకెత్తించింది. లగడ పాటి సర్వే మీద తెలుగు ప్రజల్లో ఆసక్తి చాలా ఎక్కువ. రాజకీయంగా అంటే పార్లమెంటేరియన్ గా ఆయన తెచ్చుకున్న పేరు శూన్యం. ఆయన కు ఎక్కువ పేరొచ్చింది పార్లమెంటులో మిరియాల పొడి చల్లడం ఆపైన హైదరాబాద్ నిమ్స్ డ్రా మా వల్లే. తర్వాత రాజకీయాలు మానుకుని రాజకీయాల్లో ఎపుడూ తన పేరు వినబడే మార్గం ఎంచుకున్నారు. సర్వేలుచేయించడం, అపుడపుడుకెసియార్, చంద్రబాబును కలవడం… ఇలా ఆయన రాజకీయాల్లో లేకపోయినా, కనపడతూనే వస్తున్నారు. ఇపుడు తెలంగాణ ఎన్నికల మీద సర్వే చేసి బాగా చర్చనీయాంశమయ్యారు. పోలింగ్ శాతం ఎక్కువయితే వచ్చే ది కూటమి అని చెప్పినప్పటినుంచి అందరికళ్లు పోలింగ్ శాతం మీద పడ్డాయి. పోలింగ్ శాతం నిజానికి పోలింగ్ అయిపోయిన రోజే రావాలి. పూర్వం ఎపుడో కమ్యూనికేషన్లు సరిగ్గా లేనపుడు, రోడ్లు కూడా లేని గ్రామాలనుంచిపోలింగ్ సమాచారం రావాలి కాబట్టి పోలింగ్ శాతం డిలే అయేది. ఇపుడు పోలింగ్ శాతం రావడానికి 24 పట్టింది. ఎన్నికారణాలుచెప్పినా ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఇంకా ఇరవై యేళ్ల వెనకఉందనక తప్పదు. ఇది వేరే విషయం.
ఇపుడు పోలింగ్ భారీగా జరిగిందని ప్రకంటించారు. అయితే, ఇందులో చాలా చిత్రవిచిత్రాలున్నాయి. రాష్ట్రంలో టాప్ పోలింగ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెశిడెంట్ భట్టి విక్రమార్క పోటీ చేసిన మధిర నిలబడింది. ముఖ్యమంత్రి కెసియార్, మంత్రలు కెటియార్, హరీష్ రావుల నియోజకవర్గాలలోల ప్రజలు ఇంత ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొనలేదు. అందుకే రాష్ట్రంలో భట్టి నెంబర్ వన్ నియోజకవర్గంలో తన భవిష్యత్తు పరీక్షించుకోబుతున్నారనాలి. ఈ ఎన్నికల్లో 73.20% పోలింగ్ నమోదైందని ఎన్నిలక ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు. రజత్ కుమార్ శనివారం రాత్రి ఈ వివరాలు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 67.7% పోలింగ్ జరిగిందని శుక్రవారం రాత్రి ప్రాథమిక అంచనాలను ప్రకటించారు. ఇపుడు 73,2 శాతం అన్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో నమోదైనది 69.5% మాత్రమే. అంటే ఈ ఎన్నికల్లో 3.7% పోలింగ్ పెరిగింది. ప్రజల్లో ఉరకలెత్తిన ఈ ఉత్సాహం ఎటువైపు ఉందో చూడాలంటే మరొక రెండు రోజులాగాలి.
ముఖ్యమంత్రుల పదవి రేసులో ఉన్న అభ్యర్థుల నియోజకవర్గాలలో పోలింగ్ పరిశీలిస్తే కాంగ్రెస్ ముందుంది. టిఆర్ ఎస్ వెనకబడి ఉంది.
మధిర నియోజకవర్గంలో 91.65% పోలింగ్ నమోదయింది . అక్కడ స్త్రీ పురుషలు పోటీ పడి పోలింగ్ వైపుపరుగులు తీశారు.పురుషులు అత్యధికంగా 92.54% ఓటేయగా, ఇక్కడి మహిళలు పోటాపోటీగా 90.8% ఓట్లు వేస రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గంగా మధిర ను నిలిపారు. ఆ తర్వాతి స్థానాలు ఆలేరు (91.33%), మునుగోడు (91.07%), నర్సాపూర్, భువనగిరి (చెరో 90.53%), నర్సంపేట (90.06%) నియోజకవర్గాలవి.
ముఖ్యమంత్రి కెసియార్ నియోజకవర్గం గజ్వేల్ ది ఆ తర్వాతి స్థానమే. అక్కడ పోలయింది 88.63 శాతం. అయితే, టిఆర్ ఎస్ మెగా స్టార్ హరీష్ పోటీ చేస్తున్న సిద్ధిపేటలోపోలింగ్ బాగా తక్కువ, కేవలం 79 శాతమే.మరొక కాంగ్రెస్ సూపర్ స్టార్ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 81.44 శాతమే నమోదయంది. ఇక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పోటీ చేస్తున్న హుజూర్ నగర్ లో 85.96 శాతం నమోదయింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్న నాగార్జున సాగర్ లో 86.44 శాతం ఓట్లు పోలయ్యాయి. కాబోయే ముఖ్యమంత్రిగా పేరున్న కెటి రామారావు సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల అభ్యర్థులతో పోలిస్తే బాగా వెనకబడి ఉంది. సిరిసిల్ల పోలింగ్ శాతం 80.57 శాతమే.
103 స్థానాల్లో పెరిగిన ఓటింగ్ !
2014 శాసనసభ ఎన్నికలతో పోల్చితే తాజాగా జరిగిన ఎన్నికల్లో 103 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. గతంతో పోల్చితే కేవలం 16 స్థానాల్లో పోలింగ్ శాతం తగ్గింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో పోలింగ్ పెరగగా, జీహెచ్ఎంసీతో పాటు ఇతర మరి కొన్ని పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గింది. దేవరకద్ర నియోజకవర్గంలో అత్యధికంగా 99.74% మహిళలు ఓటేసి రికార్డు సృష్టించారు. ఇక్కడ పురుషుల పోలింగ్ శాతం కేవలం 69.32 మాత్రమే కావడం గమనార్హం.
