nampally exhibition: నాంపల్లి ఎగ్జిబిషన్‌ రీ ఓపెన్.. వాహనాల దారి మళ్ళింపు

nampally exhibition

నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన పునః ప్రారంభమైంది. శుక్రవారం నుంచి సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఎగ్జిబిషన్‌ దృష్ట్యా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఎస్‌ఏ బజార్, జామ్‌బాగ్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్‌ మీదుగా.. నాంపల్లి వెళ్లే భారీ వాహనాలను అబిడ్స్‌ మీదుగా మళ్లిస్తారు. నాంపల్లి, ఎంజే మార్కెట్‌ వైపు వెళ్లే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి బీజేఆర్‌ స్టాట్యూ వైపుగా మళ్ళిస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్‌ ఓపెన్ ఉంటుంది.