పిల్లలు కనటం ఇష్టం లేదన్న భర్త.. ఆ భార్య ఏం చేసిందో తెలిస్తేనే షాక్…?

సాధారణంగా మన దేశంలో వివాహం జరిగిన తర్వాత ప్రతి స్త్రీ అమ్మగా మారాలని అనుకుంటుంది. తల్లిగా మారిన తర్వాతే స్త్రీ జన్మకు ఒక సార్థకం ఉంటుంది. అందువల్ల వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ పిల్లల్ని కని అమ్మతనంలోని ఆ మాధుర్యాన్ని అనుభవించాలని ఆశపడతారు. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి జరిగినప్పటికీ కొంతమందికి పిల్లలు జన్మించారు. అయితే మరి కొంతమంది మాత్రం అప్పుడే పిల్లల్ని కనటానికి ఇష్టపడరు. ఇక ప్రస్తుత కాలంలో చాలామంది యువతి యువకులు జీవితంలో స్థిరపడిన తర్వాత పిల్లల్ని కనాలని భావిస్తారు. అయితే ఇటీవల ఒక యువకుడు కూడా జీవితంలో స్థిరపడిన తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామని భార్యకు చెప్పాడు. అయితే ప్రస్తుతం పిల్లల్ని వద్దని చెప్పినందుకు ఆ భార్య ఏకంగా ప్రాణాలు మీదికి తెచ్చుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే… హైదరాబాద్ నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మలాని కాలనీకి చెందిన విజయ్ కుమార్ కి ప్రకాశం జిల్లా పాలురు మండలం నుచూపొద్దు గ్రామానికి చెందిన విజయలక్ష్మి అనే యువతి తో నాలుగు నెలల క్రితం జరిగింది. వివాహం తర్వాత ఈ దంపతులు ఇద్దరు బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఇక ఇటీవల విజయలక్ష్మీ తనని పిల్లలు కావాలని భర్తతో తరచూ చెబుతూ ఉండేది. అయితే ఆర్థిక ఇబ్బందులు ఉండటంవల్ల కొంతకాలం తర్వాత పిల్లల సంగతి ఆలోచిద్దామని ఇప్పుడే పిల్లలు వద్దని భార్యకు చెప్పాడు.

ఇక కొంతకాలంగా ఇక ఇదే విషయంపై తరచూ భార్యాభర్తలిద్దరి మధ్య వాదనలు జరుగుతూ ఉండేవి. తాజాగా ఇద్దరి మధ్య పిల్లల గురించి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగటంతో గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో విజయలక్ష్మి మనస్థాపానికి గురై భర్తకు చెప్పకుండా ఇంటినుండి వెళ్ళిపోయింది. ఇలా జీవితంలో స్థిరపడిన తర్వాత పిల్లల్ని కందామని భర్త చెప్పటంతో భార్య ఆగ్రహానికి గురై ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. భార్య కోసం కుటుంబ సభ్యులతో కలిసి అతను ఎంత గాలించినా కూడా ఆమె ఆచూకీ తెలియటం లేదు. దీంతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడిందేమో అన్న భయంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విజయలక్ష్మి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.