జెఎన్టీయూహెచ్ లో ఈ నెల 23న జాబ్ మేళా

జెఎన్టీయూహెచ్ లో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్లేస్ మెంట్ అధికారి డాక్టర్ సీహెచ్. వెంకటరమణా రెడ్డి తెలిపారు. 25 కంపెనీల్లో 2 వేల ఉద్యోగాల భర్తీకోసం ఈ మేళా జరగనుంది. ఇందులో 2016,2017,2018 లో పాస్ అయిన బీకాం, బీఎస్సీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా అభ్యర్ధులు హాజరు కావచ్చన్నారు.

 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళా జరగనుంది. అభ్యర్దులు తమ వెంట నాలుగు సెట్ల రెజ్యూమ్ లు, ఫోటోలు తీసుకొచ్చుకోవాలని తెలిపారు. ఇందులో ఐటి కంపెనీలు కూడా పాల్గొననున్నాయి. మరిన్ని వివరాలకు జెఎన్టీయూ హెచ్ వెబ్ సైట్ ను చూడాలని కోరారు.