రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే పిల్లల్ని చెరువులోకి తోసి తల్లి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఉదయం 8 గంటల ప్రాంతంలో చెరువులో చిన్నారుల మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.