టీమ్ ఇండియా క్రికెటర్లకు తన ఇంట్లో విందు ఏర్పాటు చేసిన రామ్ చరణ్!

హీరో రామ్ చరణ్ టీం ఇండియా క్రికెటర్లకు తన ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. క్రికెటర్లు రామ్ చరణ్ ఇంట్లో చాలా సందడి చేశారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇటీవల జరిగిన ఇండియన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ టీమ్ ఇండియా క్రికెటర్లను అభినందిస్తూ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ విందుకు హార్థిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ లతో పాటు పలువురు క్రికెటర్లు రాంచరణ్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి సందడి చేశారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఏర్పాటుచేసిన ఈ ఆహ్వానానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆటగాలను సన్మానించి సరదాగా వాళ్లతో ముచ్చటించారు. రామ్ చరణ్ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి హార్దిక్ పాండ్యాతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చేరి, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఈ పార్టీకి సంబంధించిన పూర్తి ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలోనే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తారని సమాచారం. ఈ వార్త తెలిసిన ప్రేక్షకుల్లో సంతోషం నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు బయటకు వస్తాయో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ త్వరగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చూడాలని ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి. మరొకవైపు దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమా విడుదల అవుతుండడంతో ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ కు పండగే పండగ. ఇక ఈ చిత్రా