వారి వల్ల భారీ లెవెల్లో పెరిగిన చరణ్, శంకర్ ల సినిమా లెక్క.!

ఇండియన్ విజనరీ దర్శకుడు శంకర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కెరీర్ లో కూడా ఇది 15వ సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం మొదట బడ్జెట్ గా నిర్మాత దిల్ రాజు 200 కోట్లు లోపే టార్గెట్ చేసి శంకర్ తో అగ్రిమెంట్ కూడా పెట్టుకున్నారని తెలిసిందే. కానీ ఇప్పుడు దిల్ రాజు కి ఆల్రెడీ భారీ

మొత్తంలో అమౌంట్ వచ్చేసిందట. ఈ సినిమాకి గాను నిర్మాతలు జీ స్టూడియోస్ వారు కూడా కొలాబరేట్ అవ్వడంతో బడ్జెట్ 350 కోట్లకు వెళ్ళిపోయిందట. మరి ఇదెలా అయ్యిందంటే ఈ సినిమా హిందీ థియేట్రికల్, డిజిటల్ హక్కులు లకు గాను దిల్ రాజు కి వచ్చిన ఆఫర్ ఇది అట. దీనితో ఈ సినిమా మరింత భారీ లెవెల్లో తెరకెక్కనుండడం గ్యారెంటీ.. మరి ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.