ప్రవచనాలెందుకు సామ్.. చైతూపై స్పష్టత ఇచ్చేయొచ్చుగా.?

‘గుడికి వచ్చి.. ఏం మాటలివి.? బుద్ధి వుందా.?’ అంటూ మీడియా ప్రతినిథిపై గుస్సా అయ్యింది ఇటీవల హీరోయిన్ సమంత. సమంత పేరు పక్కన అక్కినేని ఇంకా అలాగే వుందా.? లేదంటే, అక్కినేని ‘ఔట్’ అయిపోయి, పాత ‘రూత్ ప్రభు’ మళ్ళీ వచ్చి చేరిందా.? అన్న విషయమై రరకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలైనంతమాత్రాన సమంత, చైతూ.. ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి, ‘మేం విడిపోలేదు కలిసే వున్నాం..’ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విడివిడిగా ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోవడం వల్ల.. వాళ్ళు విడిపోయారనీ అనుకోవడానికి వీల్లేదు. కానీ, మీడియాలో స్పెక్యులేషన్స్ పెద్దయెత్తున వస్తున్నప్పుడు, సామ్ – చైతూ విడాకులంటూ ప్రచారం జరుగుతున్నప్పుడు, ఓ చిన్న ప్రకటన.. ఓ చిన్న స్పందన.. ఓ చిన్న ఖండన ఇరువురిలో ఎవరో ఒకరి నుంచి వస్తే సరిపోయేది.

కానీ, సమంత అలా స్పందించడంలేదు, ఖండించడంలేదు, వివరణ ఇవ్వడంలేదు.. పైగా, సోషల్ మీడియా వేదికగా ప్రవచనాలు చెబుతోంది.. మీడియాకి సుద్దులు కూడా చెబుతోంది. చైతూ కూడా ఈ విషయంలో సైలెన్స్ పాటిస్తున్నాడు. ‘నాగ్ మామా..’ అంటూ ఇటీవల తన తాజా ట్వీటు సందర్భంగా అక్కినేని నాగార్జున గురించి స్పందించి.. కొంతమేర ‘గాసిప్స్’కి చెక్ పెట్టినట్లయ్యింది సమంత. అయినాగానీ, రచ్చ అలాగే కొనసాగుతోంది. తాజాగా సద్గురు ప్రవచనాన్ని సమంత ‘కోట్’ చేయడంతో, ఈ వ్యవహారంలో మళ్ళీ వేడి మరింతగా రాజుకుంది. పరమ రొటీన్‌గానే సమంత, ఈ తరహా ప్రవచనాల్ని తన సోషల్ మీడియా పేజీల్లో పేర్కొంటూ వస్తుంటుంది. ఆ ప్రవచనాలకు పెడార్థాలు అప్పట్లో ఎవరూ తీయలేదు.. ఇప్పుడు తీస్తున్నారు. సో, సమంత ప్రవచనాల్ని పక్కన పెట్టేసి.. ఇకనైనా స్పష్టత ఇస్తే బావుంటుందేమో.. లేకపోతే, మీడియా స్పెక్యులేషన్స్ విషయంలో తన పని తాను చేసుకుపోతుందంతే.