మహేష్ అతి జాగ్రత్త..ఈ సినిమానే ఎందుకు అంత పర్సనల్ గా తీసుకున్నాడు.?

sarkaru vaari paata : టాలీవుడ్ లో ఎవర్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరో రెండు రోజుల్లో ఆ బ్లాస్ట్ కళకళలాడుతుంది. చాలా కాలం తర్వాత తన నుంచి వస్తున్న సినిమా ఇది కావడంతో మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అయితే ఈ ఒక్క సినిమా విషయంలో మాత్రం మహేష్ కాస్త అతి జాగ్రత్త తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తన గత సినిమాల్లో దేనికి కూడా లేని విధంగా ప్రమోషన్స్ గాని సినిమా కాన్సెప్ట్ ని గాని తనని తాను కొత్తగా ప్రెజెంట్ చెయ్యడంలో గాని అంతా వేరే లెవెల్లో ఈ సినిమాకి కనిపిస్తున్నాయి.

మరి ఈ సినిమా తోనే టాలీవుడ్ లో ఫస్ట్ టైం ట్విట్టర్ లో ఒక స్పెషల్ ఎమోజిని కూడా లాంచ్ చేసి ఇంకో లెవెల్లో సినిమాని సెట్ చేశారు. ఇప్పుడు అయితే ఇంకో స్టెప్ ముందుకు వేసి తన గత సినిమాల్లో దేనికి చెయ్యని విధంగా ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ వీడియో ని రిలీజ్ చేసాడు. అందులో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి.

తన భార్య ట్విట్టర్ లోకి రావాలని ట్విట్టర్ కి డెఫినెట్ గా ఒక ఎడిట్ ఆప్షన్ ఉండాలి అని ఇంకా సర్కారు వారి పాట ఎలా ఉంటుంది అంటే తన అభిమానులు ఈ సమ్మర్ ని బ్లాస్ట్ చేసుకునేలా ఉంటుంది అని అలాగే తన కోసం తాను చెప్పుకోవాలి అంటే కామ్ అండ్ ఫోకస్ గా ఉంటానని ఇలా చాలానే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు. మరి ఇలా ఇన్ని చేస్తుండడంతో ఎందుకో బాగా పర్సనల్ గా తీసుకున్నట్టే అనిపిస్తుంది. మరి మహేష్ ఇంతలా నమ్మిన ఈ సినిమా భవిష్యత్తు ఏంటో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.