కన్నుగీటే సీన్లో ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రంతో రాత్రికి రాత్రే జాతీయస్థాయిలో పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాశ్ వారియర్. మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రియా వారియర్కు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 7.2 మిలియన్ ఫాలోవర్సు ఉండటం విశేషం.
లాక్డౌన్ టైమ్లో సినీతారలందరూ సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ వీడియోల ద్వారా సంభాషిస్తూ అనేక సంగతుల్ని పంచుకుంటున్నారు. అయితే ఈ కేరళ కుట్టి మాత్రం తన ‘ఇన్స్టాగ్రామ్’ ఎకౌంట్ను డియాక్టివేట్ చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది. దీంతో ప్రియా వారియర్ సోషల్ మీడియాకు బై బై చెప్పేసిందని అందరూ అనుకున్నారు. అయితే ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెడుతూ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇన్స్టాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
మానసిక ప్రశాంతత కోసం ఇన్స్టా నుండి కాస్త బ్రేక్ తీసుకున్నానని ఆమె చెప్పింది. “లాక్డౌన్ అప్పటి నుండి నాలో ఒత్తిడి పెరిగిపోయింది. సోషల్మీడియాలో అభిమానుల ప్రశంసలు, విమర్శలు, అనవసరమైన కామెంట్ లు.. అయోమయ పరిస్థితి ఎదురైంది. వీటి నుంచి బయటపడి.. మనశ్శాంతిని వెతుక్కోవాలని ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నా. ట్రోల్సు ఈ రేంజ్లో వస్తాయని ఊహించలేదు.
నా వ్యక్తిగత కారణాలతో ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి నిష్క్రమించాను. ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరనుకున్నా. కానీ సోషల్మీడియాలో వచ్చిన ట్రోల్సు, పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆశ్చర్యపోయాను. నా పర్సనల్లైఫ్ మీద ఇతరులకు ఎందుకింత ఆసక్తి అనిపించింది. భవిష్యత్తులో కూడా నాకు నచ్చకపోతే సోషల్మీడియా నుంచి తప్పుకుంటా అని తన మనసులోని భావాలను వెలిబుచ్చింది.