ఇంతకీ మహేష్ బాబు గొడవ ఎవరితో ?

Who is the villain for Mahesh Babu
Who is the villain for Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’.  పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు.  సినిమా షూటింగ్ మొదలై చాలారోజులే అయింది. అయితే ఇంతవరకు సినిమాలోని ప్రధాన తారాగణం గురించిన అప్డేట్స్ ఏవీ బయటకు రాలేదు. మహేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుందనే సంగతి తప్ప ఇంకే విశేషాలు బయటకు రాలేదు. ముఖ్యంగా విలన్ ఎవరనేది క్లారిటీ లేదు. మహేష్ దాదాపు టాలీవుడ్లో ఉన్న అందరు విలన్లతో నటించేశారు. వారిలో ఎవరిని రిపీట్ చేసినా ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. మహేష్ గత చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో ప్రకాష్ రాజ్ ను ప్రతినాయకుడిగా చూసే బోర్ ఫలయ్యారు ఆడియన్స్. 
 
అందుకే కొత్త సినిమాలో కొత్త విలన్ ఉండాల్సిందే అంటున్నారు. దర్శకుడు పరశురామ్ కూడ అదే అనుకుంటున్నారు.  అందుకే మహేష్ సినిమాలో కొత్త విలన్ కోసం వెతుకులాడారు. అయితే ఎవర్ని ఫైనల్ చేశారనేది మాత్రం బయటకు రానివ్వట్లేదు.  మొదట్లో అరవింద్ స్వామి పేరు గట్టిగా వినబడింది.  అరవింద్ స్వామి అయితే మహేష్ బాబుకు పోటాపోటీగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా యాక్షన్ కింగ్ అర్జున్ పేరు తెరమీదకు వచ్చింది. అర్జున్ కూడ ఈమధ్య నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఆయన మహేష్ బాబుతో ఎప్పుడూ నటించింది లేదు. అందుకే ఆయన్ను తీసుకున్నారని కొత్త వార్తలు మొదలయ్యాయి. ఈ ఇద్దరిలో ఎవరు విలన్ అనేది తేలలేదు కానీ ఎవరిని తీసుకున్నా మహేష్ సినిమాకు ఒక ఫ్రెష్ లుక్ అనేది తప్పకుండా వస్తుంది.