క్రిష్ ‘కొండపోలం’ ఏమైనట్టు

What about Krish's Kondapolam

What about Krish's Kondapolam

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఏకంగా 70 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డ్ నెలకొల్పింది. దీంతో వైష్ణవ్ తేజ్ మీద అందరి దృష్టి పడింది. ఆయనకు వరుస ఆఫర్లు రావడం మొదలైంది. ‘ఉప్పెన’ తర్వాతనే ఆయన స్థాయి మారింది. కానీ ‘ఉప్పెన’ విడుదలకు ముందే ఆయన్ను అప్రోచ్ అయి సినిమా చేశారు క్రిష్. లాక్ డౌన్ ఇబ్బందుల్లో కూడ సినిమాను ముగించేశారు. చాలా రక్కువ సమయంలో షూటింగ్ ముగించాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో కథానాయిక. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ‘కొండపోలం ‘ అనే టైటిల్ అనుకున్నారు.

‘ఉప్పెన’ హిట్టవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. క్రిష్ సినిమాలంటే ఏదో ఒక విశేషం తప్పకుండా ఉంటుందని అనుకున్నారు. రిలీజ్ డేట్ కోసం చూశారు. అయితే క్రిష్ మాత్రం ఆ సినిమా విషయంలో సైలెంట్ అయిపోయారు. ఎక్కడా సినిమా ఊసే లేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందా లేదా కూడ తెలియట్లేదు. కొందరేమో ‘ఉప్పెన’ చూసి సినిమాకు రిపేర్లు మొదలుపెట్టారని, అందుకే ఆలస్యమవుతోందని అంటున్నారు. ‘ఉప్పెన’ స్థాయికి మ్యాచ్ అయ్యేలా సినిమాను రెడీ చేసే పనిలో ఉన్నారని టాక్.