నిత్యం అదే పనిలో ఉంటుంది.. అమ్మపై యాంకర్ వర్షిణి కామెంట్స్

varshini sounderajan visits tirumala

యాంకర్ వర్షిణి బుల్లితెరపై ఎంతటి రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. వచ్చీ రానీ స్టెప్పులు వేసి, కళ్లు జోకులతో నవ్విస్తూ ఉంటుంది వర్షిణి. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌ మంచి పేరు తీసుకొచ్చినా.. బుల్లితెరనే ఎక్కువ మందికి పరిచయం చేసింది. పటాస్ షోతో బాగానే ఫేమస్ అయింది. ఇక అక్కడి నుంచి జబర్దస్త్ వేదికపై, ఢీ షోలో ఇలా తన సత్తా చాటుకుంటూ వస్తోంది. ఇక ఢీషోలో తన కామెడీ టైమింగ్, డ్యాన్స్‌లను మెరుగుపరుచుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

Varshini Sounderajan Visits Tirumala With family
Varshini Sounderajan Visits Tirumala With family

ఢీ షోలో హైపర్ ఆదితో నడిపే రహస్య బంధంతో వర్షిణి బాగా ఫేమస్ అయింది. వీరి కెమిస్ట్రీకి ఢీ షో కూడా ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అప్పటి వరకు రష్మీ సుధీర్ మాత్రమే జంటగా ఉండేవారు.. వీరి రాకతో ఆ జంటకు కాంపిటిషన్ పెరిగినట్టైంది. యూట్యూబ్‌లో వర్షిణి ఆదిలపై లెక్కలేనన్ని వీడియోలు ఉంటాయి. ఒకానొక సందర్భంలో వీరిద్దిరికి పెళ్లి కూడా చేసేశారంటే ఆ రేంజ్‌లో వీరి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది.

Varshini Sounderajan Visits Tirumala With family
Varshini Sounderajan Visits Tirumala With family

ఇక తాజాగా ఈ సుందరి తిరుమల క్షేత్రానికి వెళ్లింది. కుటుంబ సభ్యులతో కలిసి ఏడు కొండల స్వామిని దర్శించుకుంది. తిరుపతిలో తిరిగిన, చూసిన విశేషాలను అభిమానులతో పంచుకుంది. తిరుగు ప్రయాణంలో వస్తోండగా.. తన అమ్మపై వర్షిణి ఓ కామెంట్ చేసింది. ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది అంటూ అమ్మపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వర్షిణి చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. అమ్మ అలా ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో వర్షిణికి బాగా బోర్ కొట్టినట్టు అనిపిస్తోంది.