Revanth Reddy: పేదలను, మధ్యతరగతి ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టదు: రేవంత్ రెడ్డి

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం.. పేదల దగ్గర్నుంచి మధ్య తరగతి వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదని ఆగ్రహించాడు. అందరికీ తెలంగాణ ప్రభుత్వం కరెంటు షాక్ ఇచ్చిందని అన్నారు. మోదీ ప్రభుత్వం నిత్యం గ్యాస్, పెట్రోల్ వాతలు పెడుతుందని అన్నాడు.

నిజానికి మోదీ, కేసీఆర్ ల తీరు గజదొంగల కన్నా ఘోరంగా ఉందని తన మనసులో మాట బయట పెట్టాడు. అంతేకాకుండా పెట్రోల్ ధరల పెరుగుదల పై టీఆర్ఎస్ ఆందోళనలు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డాడు. కేసీఆర్ ప్రభుత్వం తర్వాతకు ఉండదన్నట్లుగా బై బై కేసీఆర్ అని కూడా అన్నాడు.