చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

ఈతకని వెళ్లి.. చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన జవహర్‌నగర్‌ పరిధిలో చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్ళిన ఆరుగురు విద్యార్థులు చెరువులో మునగిపోగా.. ముగ్గురు మృతదేహాలను గజా ఈత గాళ్ళు వెలికితీశారు. మిగితా వారి కోసం గాలిస్తున్నారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.