Balakrishna: బాలయ్య టాక్ షోకి ముందుగా ఆ ఇద్దరు హీరోలను అనుకున్నారట..

Balakrishna: టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఆహాలో అన్ స్టాపబుల్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వెండితెర పై అలరించిన బాలయ్య, ప్రస్తుతం బుల్లితెరపై కూడా అదేరీతిలో తన సత్తాను కొనసాగిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. రాజమౌళి, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, రవితేజ, మోహన్ బాబు, నాని లాంటి సెలబ్రిటీలు ఈ షోకి హాజరై బాలకృష్ణ తో పలు ఆసక్తికర విషయాలు పెంచుకోవడమే కాకుండా సందడి సందడి కూడా చేశారు.

ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ఈ షో అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఓటీటీ వేదికలో ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఐఎమ్ డీబీలో 9.8 రేటింగ్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. ఇక ఈ షో చివరి ఎపిసోడ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్న విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోని ఓటీటీ వేదికపై చూడటానికి మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఫిబ్రవరి 4వ తేదీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా మొదట బాలయ్యను అనుకోలేదట, బాలయ్య కంటే ముందుగా మరొక ఇద్దరు స్టార్ హీరోలని అనుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మొదటగా సీనియర్ హీరో వెంకటేష్ అని సంప్రదించారట. అనంతరం నాచురల్ స్టార్ నాని ని కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు హీరోలు పలు కారణాల వల్ల ఈ షో ని వదులుకోవడం తో చివరకు ఈ షో నిర్వాహకులు బాలయ్య వద్దకు వెళ్లారట. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక బాలయ్య తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ చరిత్ర సృష్టించడంతో పాటు షో రేటింగ్స్ పరంగా వెనుతిరిగి చూస్తే పరిస్థితి లేకుండా చేశారు.