స్టేజ్ మీదనే భావోద్వేగం అయ్యిపోయిన మహేష్..కారణం అతడేనట.!

Mahesh Babu : తెలుగు సినిమా నుంచి ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతున్న మరో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఇది కావడంతో నిన్న ఎంతో ఘనంగా ఈ సినిమా తాలూకా గ్రాండ్ ఈవెంట్ జరిగింది.

అయితే ఈ ఈవెంట్ లో అనుకోని విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజి మీదనే మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యిపోయాడు. తాను మాట్లాడుతూ ఈ రెండేళ్లలో చాలా మంది నాకు దూరం అయ్యిపోయారు అని చెప్పిన మాట అందరిలో ఒక ఆసక్తిని రేపింది.

మహేష్ ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి అంతలా తనకి దూరం అయ్యింది ఎవరు మహేష్ ఎందుకు ఎప్పుడు లేనిది ఇంత భావోద్వేగానికి గురయ్యాడు అనే ప్రశ్నలు మహేష్ అభిమానులను తొలిచేశాయి. అయితే దీనికి కారణం తన సోదరుడు అట. తన అన్నయ్య అయినటువంటి ఘట్టమనేని రమేష్ బాబు ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో కన్ను మూసారు.

దీనితో తన అన్నయ్యని తలచుకొని మహేష్ ఈ సినిమా ఈవెంట్ లో భావోద్వేగానికి లోనయ్యారని తన సన్నిహిత సినీ వర్గాల వారు తెలుపుతున్నారు. ఇదే మహేష్ అంత ఎమోషనల్ అవ్వడానికి గల కారణం అట. మరి ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని దర్శకత్వం వహించాడు.