మెగాపవర్ స్టార్ రంగంలో దిగేది అప్పుడే.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పలు భారీ సినిమాలతో పాన్ ఇండియన్ ఫేమ్ తెచ్చుకునే క్రమంలో ఉన్నాడు. రిలీజ్ కి రెడీ గా ఉన్న భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) తర్వాత మరో పాన్ ఇండియా సినిమా దర్శకుడు శంకర్ తో చేయబోతున్నాడు. దీనిపై కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ లో చరణ్ ఎప్పుడు నుంచి పాల్గొననుడ్డాడో తెలుస్తోంది. ఈ వచ్చే అక్టోబర్ 22 నుంచి పూణే లో జరగనున్న షూట్ తో చరణ్ రంగంలో కి దిగనున్నాడట. ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు తమ బ్యానర్ నుంచి 50వ సినిమాగా దీన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.