ఇన్సైడ్ టాక్ : “ఆచార్య” నష్టాలను సెటిల్ చేస్తుంది అతనొక్కడే అట.!

Acharya

Acharya : ఈ ఏడాదిలో టాలీవుడ్ దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని వచ్చిన చిత్రాల్లో దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన ఈ మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” కూడా ఒకటి. అయితే ఈ సినిమా భారీ అంచనాలు నెలకొల్పుకొని వచ్చింది.

కానీ అసలు ఈ సినిమా ఏ కోశానా కూడా అలరించేలా లేకపోవడంతో తెలుగు సినిమా దగ్గర భారీ లాసులు ఇచ్చిన సినిమాగా ఇది నిలిచిపోయింది. అయితే ఈ సినిమా నష్టాలను రామ్ చరణ్ మరియు మెగాస్టార్ లు కలిసి సెటిల్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇద్దరూ కూడా తమ తమ పనుల్లో ఉన్నారు.

దీనితో ఆ భాద్యత ఇప్పుడు దర్శకుడు కొరటాల మీదే పడినట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్. తాను మాత్రమే ఇప్పుడు ఆచార్య పై వచ్చిన డబ్బులు డిజిటల్ ఓటిటి పరంగా వచ్చిన వాటితో ఇతర డిస్ట్రిబ్యూటర్స్ కి అందిస్తున్నట్టు వినిపిస్తుంది.

దీనితో అదంతా కొరటాల పైనే వారు పెట్టేశారని ఒక ప్రచారం జరుగుతుంది. అందుకే ఎన్టీఆర్ తో చేసే సినిమా కూడా కొద్దిగా ఆలస్యం అవుతుంది అని టాక్. దీని తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో చేసే సినిమాపై బిజినెస్ కూడా జాగ్రత్తగా చూసుకుంటాడని తెలుస్తుంది. మొత్తానికి అయితే మధ్యలో కొరటాల బుక్కయ్యిపోయాడు అని చెప్పాలి.