టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు కృష్ణంరాజు సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వారసుడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇకపోతే కృష్ణంరాజుకి అందరూ కూతుర్లు అనే విషయం మనకు తెలిసిందే వీరిలో సాయి ప్రసీద అమెరికాలో ప్రొడక్షన్ కోర్సు పూర్తిచేసి ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఇక ఈ సినిమా తర్వాత సాయి ప్రసీద సోషల్ మీడియా కు దూరం అయ్యారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ప్రముఖ ఫుడ్ యాప్ స్విగ్గి పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఈమె చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్విగ్గి ఎప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసిన తప్పు ఆర్డర్ ఇవ్వడమే కాకుండా బాడ్ ఫుడ్ డెలివరీ చేస్తారని ఈమె స్విగ్గి సమస్థ పై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి చెత్త సర్వీస్ ఉన్నటువంటి ఫుడ్ యాప్ ఉంచుకోవడం అనవసరం అంటూ తెలిపారు.
అందుకే లైఫ్ లో తను స్విగ్గి ఆర్డర్ చేయకూడదని అందుకే యాప్ డిలీట్ చేస్తున్నానని ఈ సందర్భంగా స్విగ్గి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమె చేసిన ఈ ట్వీట్ పై స్విగ్గి యాజమాన్యం స్పందించారు.ఈ క్రమంలోనే స్విగ్గి యాజమాన్యం స్పందిస్తూ మేము ఆర్డర్ తప్పుగా ఇచ్చామని,మా టీం నుండి ఆశించిన మద్దతు పొందలేదని మేము అర్థం చేసుకున్నాము. దయచేసి ఆర్డర్ IDతో మాకు సహాయం చేయండి. మేము పరిశీలిస్తాము అంటూ స్విగ్గి ఈమె కామెంట్లకు స్పందించారు. మొత్తానికి సోషల్ మీడియా వేదికగా ఈమె చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
