టాలీవుడ్ లో న్యూ ప్రామిసింగ్ గ్లామరస్ హీరోయిన్ గా మారుతున్న మీనాక్షి చౌదరి

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయిన మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.
ఆశించిన స్థాయిలో ఈ చిత్రం మెప్పించకపోయిన  ఈ ముద్దుగుమ్మ అందానికి, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను అలరించ లేకపోయినప్పటికీ ఈ మూవీ లో మీనాక్షి చౌదరి మాత్రం తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును హీటెక్కించింది .

ప్రస్తుతం ఈమె వరుస  అవకాశాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈమె నటించిన హిట్-2 చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. నేచరల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహారించారు. అలానే ఈమె తమిళ్ లో కూడా బాగానే రాణిస్తుంది. ప్రస్తుతం “కొలై” అని చిత్రం తమిళ్ లో రిలీజ్ కు రెడీ గా ఉంది. అలానే తమిళ్ మరో కొత్త చిత్రం చేసేందుకు కూడా ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతుంది.

మీనాక్షి చౌదరి తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ కుర్రకారును ఆకర్షిస్తుంది.ఏదేమైనా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న న్యూ ప్రామిసింగ్ యాక్ట్రెస్ లో మీనాక్షి చౌదరి ఒకరు.