సెల్వరాఘవన్, ధనుష్ ల “నేనే వస్తున్నా” చిత్రం నుండి “ఒకే ఒక ఊరిలోనా” పాట విడుదల

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. “నేనే వస్తున్నా” పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది.

తాజాగా ఈ చిత్రం నుండి “ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా” పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం.
ఈ పాటను చంద్రబోస్ రచించారు.
“పాముల్లోనా విషముంది,పువ్వులోని విషముంది
పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే
మనిషిలో మృగమే దాగుంది, మృగములో మానవత ఉంటుంది”
లాంటి లైన్స్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ లోని రెండు విభిన్నకోణాలని ఆవిష్కరించడమే కాకుండా,  ఆలోచించే విధంగా ఉన్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై  “కలైపులి ఎస్ థాను” నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.సెప్టెంబర్ 29 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు:
ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు మరియు యోగిబాబు

సాంగ్ క్రెడిట్స్:
రచన: చంద్రబోస్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సింగర్: ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ

టెక్నికల్ టీమ్:
కథ: సెల్వరాఘవన్, ధనుష్
దర్శకుడు: సెల్వ రాఘవన్
బ్యానర్: వి క్రియేషన్స్
నిర్మాత: కలై పులి ఎస్ థాను
సమర్పణ: గీత ఆర్ట్స్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
PRO: ఏలూరుశ్రీను , మేఘశ్యామ్