టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో నటించిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా ఈ నెల 12 వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరోయిన్ కీర్తిసురేష్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ తనకు ఈ సినిమాలో అవకాశం కల్పించినందుకు మైత్రి మూవీ మేకర్స్ అలాగే కళావతి వంటి అద్భుతమైన పాత్రను ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక అనంతరం డైరెక్టర్ గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ ఆయన నేను పక్కన ఉండగానే రష్మిక… రష్మిక అంటూ తన పేరుని కలవరిస్తున్నారు. ఇక తన తదుపరి సినిమాలో రష్మిక నటిస్తే తన ముందు నా పేరును కలవరిస్తారో లేదో చూడాలి అంటూ డైరెక్టర్ పరశురామ్ గురించి కీర్తి సురేష్ తెలియజేశారు.
ఇకపోతే పరుశురామ్ దర్శకత్వంలో రష్మిక విజయ్ దేవరకొండ జంటగా గీతా గోవిందం అనే సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
