సినిమా అంటేనే అదొక మాయ ప్రపంచం. ఎప్పుడు ఎవరి జీవితాలు తారుమారవుతాయో ఎవరికీ తెలియదు. సినిమా నిర్మించడం ఒక వంతు అయితే…దాన్ని విడుదల చెయ్యడం ఇంకో వంతు. ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని సినిమాలు చాలా ఉన్నాయి. ఏవేవో కారణాల వాళ్ళ సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
తాజాగా అలాంటి ఒక సినిమా ఇప్పుడు విడుదల కాబోతుంది. ఏదో ఒకటి, రెండు సంవత్సరాల క్రితం సినిమా కాదు. ఏకంగా నలభై సంవత్సరాల క్రితం సినిమాని ఇప్పుడు రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
1982 లో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ నటించిన ‘ప్రతిబింబాలు’ అనే సినిమా అప్పట్లో కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.. ప్రస్తుతం ఆ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. అక్కినేని నాగేశ్వర రావు గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయడం కోసం నిర్మాత రాధాకృష్ణ ప్రకటించారు.. ఈ మూవీని థియేటర్లలోనే విడుదల చేస్తాం అంటూ ఆయన తెలిపారు.
ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. ఇందులో గుమ్మడి, కాంతారావు వంటి సీనియర్ నటులు కూడా నటించారు. 40 ఏళ్ల కింద సినిమా కాబట్టి ప్రస్తుతం ఉన్న యువత అలనాటి ఈ సినిమా ని థియేటర్ లో చూడడానికి ఇష్టపడతారో లేదో చూడాలి.
