దళితులపై జగన్ రెడ్డి దమనకాండకి అంతే లేదా? లోకేశ్ బాబు ఫైర్

tdp leader nara lokesh fires on ap cm ys jagan mohan reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. కాస్త ఘాటుగానే మాట్లాడారు. దళితులపై జగన్ రెడ్డి దమనకాండకు అంతే లేదా? అంటూ ట్వీట్ చేశారు.

tdp leader nara lokesh fires on ap cm ys jagan mohan reddy
tdp leader nara lokesh fires on ap cm ys jagan mohan reddy

వైసీపీ పాలనలో దళిత జాతిపై వారానికో దాడి, నెలకో శిరోముండనం, మూడునెలలకో హత్య జరుగుతోంది. దళితులపై పిచ్చోళ్లనే ముద్ర, శిరోముండనం, కొట్టి చంపడం, నిప్పంటించడం ఎప్పుడైనా జరిగాయా? దళితులను ఇంత ఘోరంగా అవమానించిన పాలకుడు జగన్ రెడ్డి గారు ఒక్కరే.. అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

దళితులపై దాడులకు నిరసనగా టీడీపీ పార్టీ దళిత శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్సీలపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు నిరసనగా పార్లమెంట్ నిలదీయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్సీలపై దాడుల సంఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

అయితే.. ఏపీలో అంతర్వేది రథం దగ్ధం అయి అందరూ దానికి బాధ్యులు ఎవరు అనే విషయంపై చర్చిస్తున్న సమయంలో చంద్రబాబు దళిత శంఖారావం అంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించడం దేనికి. ఓవైపు హిందుత్వవాదాన్ని చంపే కుట్ర జరుగుతుంటే.. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చంద్రబాబుకు అవసరమా? అంటూ ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇప్పటికే చాలామంది వైసీపీ నేతలు, ఇతర నాయకులు.. అంతర్వేది ఘటనలో టీడీపీ కుట్ర ఉందని.. సీబీఐ విచారణలో నిజం నిగ్గుతేలుతుందని చెబుతున్నారు.

https://twitter.com/naralokesh/status/1304384869623975936