క‌రోనా పాజిటివ్ అని క‌న్‌ఫాం చేసిన స్టార్ హీరో.. ఆందోళ‌న‌లో అభిమానులు

కంటికి క‌నిపించ‌ని క‌రోనా మ‌హ‌మ్మారి ఎంతటి వినాశ‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సామాన్యులు, సెల‌బ్రిటీలు అని తేడా లేకుండా ఎంద‌రినో పొట్ట‌న పెట్టుకుంది. కరోనా చేయ‌బ‌ట్టి ఎంద‌రో లెజండ‌రీస్ మృత్యువాత ప‌డ్డారు. దీంతో సినీ ప‌రిశ్ర‌మ‌తో పాటు అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. క‌రోనా ఉదృతి ఇప్పుడు కాస్త త‌గ్గిన‌ట్టు భావిస్తున్న ప్ర‌జ‌లు అజాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి త‌న ప్ర‌తాపం చూపిస్తూనే ఉంది. దాదాపు ఏడెనిమిది నెల‌లు ష‌ట్ డౌన్ అయిన థియేట‌ర్స్, స్టేడియాలు, ర‌వాణా వ్య‌వ‌స్థ అన్ని ఇప్పుడు స‌జావుగా సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు త‌ప్ప‌క జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

సినిమా సెల‌బ్రిటీలు ప్ర‌స్తుతం త‌మ సినిమా షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా త‌మిళ న‌టుడు సూర్య క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆదివారం అర్ధరాత్రి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. నేను కరోనాతో బాధపడుతున్నాను. తర్వగానే కోలుకుంటున్నా. మ‌న జీవితం ఇంకా సాధార‌ణ స్థితికి రాలేద‌నే విష‌యం గ‌మ‌నించాలి. భ‌యాన్ని వ‌దిలా జాగ్ర‌త్త‌లు పాటిస్తే మంచిది. అంకితమైన సహాయక వైద్యులకు ప్రేమ మరియు ధన్యవాదాలు’’ అని తెలియజేస్తూ హీరో సూర్య ట్వీట్ చేశారు. ఇటీవ‌లి కాలంలో న‌న్ను క‌లిసిన వారంద‌రు త‌ప్ప‌కు ప‌రీక్ష‌లు చేయించుకోవాలంటూ సూర్య స్ప‌ష్టం చేశారు.

గ‌త ఏడాది సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘సూరారై పోట్రు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య‌. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ పేరుతో వచ్చింది. ఓటీటీలో విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌తో పాటు సెల‌బ్రిటీల‌ను సైతం ఆక‌ట్టుకుంది. విమ‌ర్శ‌కులు ఈ మూవీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ మూవీ థియేట‌ర్ లో విడుద‌లై ఉంటే బాగుండేద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. సూర్య ప్ర‌స్తుతం త‌న 40వ సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రాన్ని పాండిరాజ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.