హీరోగా సుమ త‌న‌యుడు.. ప‌క్కా ప్లాన్ అమ‌లు చేస్తున్న స్టార్ యాంక‌ర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత నెపోటిజం గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. స్టార్స్ వార‌సులు ఇండ‌స్ట్రీని ఏలుతుంటే సామాన్యుల ప‌రిస్థితి దుర్భరంగా మారిందని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సుశాంత్ కూడా నెపోటిజం వ‌ల‌నే మ‌ర‌ణించాడ‌ని చెప్పుకొచ్చారు. అయితే నెపోటిజం అనేది ఒక్క ఇండ‌స్ట్రీకే ప‌రిమితం కాలేదు. టాలీవుడ్, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్‌ల‌లోను వార‌సుల హ‌వా కొన‌సాగుతుంది.

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు రంగ‌ప్ర‌వేశం చేసి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. ఇప్పుడు స్టార్ యాంక‌ర్‌గా బుల్లితెర‌పై ఏక‌చ‌త్రాధిప‌త్యం సాగిస్తున్న సుమ త‌న త‌న‌యుడు రోష‌న్ క‌న‌కాల‌ని హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రోష‌న్ కోసం మంచి క‌థ విన్న సుమ త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించాల‌ని అనుకుంటుంద‌ట‌. రోష‌న్‌ని నూత‌న ద‌ర్శ‌కుడు డైరెక్ట్ చేయ‌నుండ‌గా, ఈ సినిమా కోసం సుమ స‌హ నిర్మాత‌గా మార‌నుంద‌ట‌. కొత్త నిర్మాణ సంస్థ చిత్రాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

రోష‌న్ ఇప్పటికే ఓ చిత్రంలో అతిధి పాత్ర‌లో మెరిసాడు. హీరోగా త‌న త‌న‌యుడిని వెండితెర‌పై చూడాల‌ని క‌ల‌లు కంటుది సుమ‌. ఈ క్ర‌మంలోనే రోషన్ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు మొద‌లు పెట్టింద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. సుమ కొన్నేళ్ళుగా యాంక‌ర్‌గా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉంది. ఇక సుమ భ‌ర్త రాజీవ్ క‌న‌కాల న‌టుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. ఆ మ‌ధ్య ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అర‌వింద స‌మేత‌లోను ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర పోషించి అల‌రించాడు.