దేశీయ స్టాక్ మార్కెట్లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1040 పాయింట్లకు పైగా ఎగబాకి 56,817 వద్ద ముగియగా.. నిఫ్టీ కూడా 312 పాయింట్లు వృద్ధి చెంది 16,975 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు దన్నుగా నిలివడం… ఈ రోజు రాత్రి వెలువడనున్న అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, చమురు ధరల కదలికలు, చైనాలో లాక్డౌన్ల వంటి పరిణామాలు మార్కెట్పై ప్రభావాన్ని చూపాయి.