మళ్లీ ‘నేనింతే’ శియా గౌతమ్!

కెఎల్ఎన్ క్రియేషన్స్ క్రియేటివ్ క్యారెక్టర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాలో ‘నేనింతే’ సినిమా హీరోయిన్ శియా గౌతమ్  హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు ‘మరో మహా భారతం’ టైటిల్ ను ఖరారు చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. జగదీష్ దూగాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి లక్ష్మీ నారాయణ కిల్లి,  రామకృష్ణ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మొదటివారం నుండి ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది.