ఎడారిలో మ‌హేష్ కూతురు.. చిన్నారి ధైర్యం చూసి షాక‌వుతున్న నెటిజ‌న్స్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త గారాల ప‌ట్టి సితార రోజురోజుకు త‌న ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. ఈ చిన్నారికి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేక అకౌంట్ ఉండ‌గా, రోజురోజుకు ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. సితార చిన్న‌ప్ప‌టి నుండి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న తండ్రి సినిమాలోని పాట‌లు పాడ‌డం, లేదంటే డ్యాన్స్ లు వంటివి చేస్తూ ఉండేది. వీటికి సంబంధించిన వీడియోల‌ను న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉండ‌డంతో ఇవి ఫుల్ వైర‌ల్ అయ్యేవి .

న‌మ్ర‌త బ‌ర్త్ డే వేడుక‌ల కోసం దుబాయ్ వెళ్ళిన మ‌హేష్ ఫ్యామిలీ అక్క‌డే సెటిల్ అయింది. న‌మ్ర‌త బ‌ర్త్‌డే జ‌రిగిన కొద్ది రోజులకు మ‌హేష్ న‌టిస్తున్న ‌స‌ర్కారు వారి పాట చిత్ర షూటింగ్ మొద‌లు కాగా, ఈ షెడ్యూల్‌ను దుబాయ్‌లో నెల రోజుల పాటు ఉండేలా ప్లాన్ చేశారు. దీంతో మ‌హేష్ ఫ్యామిలీ దుబాయ్‌లోనే ఉండిపోయింది. ఇక మ‌హేష్ ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉండ‌గా, వీలున్న‌ప్పుడ‌ల్లా అక్క‌డి అంద‌మైన ప్ర‌దేశాల‌ను త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ దుబాయ్‌లోని ఎడారిలో జ‌రుగుతున్న షూటింగ్ తో బిజీగా ఉండ‌గా, ఆయ‌న‌తో పాటు సితార కూడా లోకేష‌న్‌కు హాజ‌రైంది.

ఎడారిలో సితార రైడింగ్ చేయ‌డంతో పాటు ఒంటెల‌తో ఫొటోలు దిగింది. ఇవి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చేస్తున్నాయి. ఎడారిలో సితార సాహసంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.కాగా, మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట చిత్రం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. బ్యాంకు నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. దుబాయ్ షెడ్యూల్ త‌ర్వాత హైదరాబాద్ లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో మూవీ షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు.