ఇంత చిన్న‌వ‌య‌స్సులోనే బ్రాండ్ అంబాసిడ‌రా.. చూస్తుంటే కూతురిని ఎక్క‌డికో తీసుకెళ్ళేలా ఉన్నాడే!

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌ట వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న మ‌హేష్ బాబు అన‌తి కాలంలోనే టాప్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు ఆయన సినిమాల‌కి కోట్ల బిజినెస్ జ‌రుగుతుంది. తెలుగులోనే కాక ఇత‌ర భాష‌ల‌లోను అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన మ‌హేష్ బాబు ఇటీవ‌లికాలంలో సమాజంలో మార్పు తీసుకొచ్చే చిత్రాలు చేస్తున్నాడు. శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను, స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని దోచుకున్న మ‌హేష్ ఇప్పుడు స‌ర్కారు వారి పాట చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం జ‌న‌వ‌రి నుండి షూటింగ్ జ‌రుపుకోనుంది.

మ‌హేష్ భార్య న‌మ్ర‌త కూడా మంచి ఆర్టిస్ట్ అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. పెళ్లైన త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న న‌మ్ర‌త పిల్ల‌ల బాగోగులు, ఇంటి వ్య‌వ‌హ‌రాలు, ఇత‌ర బిజినెస్ వ్య‌వ‌హ‌రాలు చూసుకుంటూ కాలం గ‌డుపుతుంది. ఇక మ‌హేష్- న‌మ్ర‌త‌ల పిల్లలు గౌత‌మ్-సితార కూడా త‌క్కువ టైంలోనే సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందారు. గౌతమ్ ఇప్ప‌టికే 1 నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాగా, సితార వెండితెర ఎంట్రీ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఫుల్ పాపులారిటీ సంపాదించింది.

సితార సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న తండ్రి సినిమా పాట‌ల‌కు డ్యాన్స్ లు చేయ‌డం లేదంటే ఆ డైలాగ్స్ తాను చెప్ప‌డం వంటివి చేస్తూ నెటిజ‌న్స్ దృష్టి ఆక‌ర్షిస్తుంటుంది. ఆ మ‌ధ్య వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య‌తో క‌లిసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన సితార అనేక విష‌యాల గురించి వివ‌రించింది. తాజాగా ఈ చిన్నారి 3డీ యానిమేషన్‌ వెబ్‌సిరీస్‌‌గా తెరకెక్కించిన ఫంటాస్టిక్‌ తారకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారింది. బుధ‌వారం రాత్రి వెబ్ సిరీస్ పోస్ట‌ర్ లాంచ్ చేయ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో నమ్రతా శిరోద్కర్‌, బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ వెబ్ సిరీస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడం పట్ల చాలా ఆనందంగా ఉందని సితార తెలిపింది. ఈ కార్యక్రమంలో సితార తన చిలిపి మాటలతో అందరి దృష్టిని ఆక‌ర్షించింది.