Mohan Babu : షాకింగ్ : మోహన్ బాబుని టార్గెట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు..ఇదంతా వారి వల్లేనట!

Mohan Babu : ఈరోజు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న లేటెస్ట్ చిత్రాల్లో టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం “సన్ ఆఫ్ ఇండియా” కూడా ఒకటి. అయితే ఎందుకో కానీ ఈ సినిమా వరకు వస్తే గత కొన్ని రోజులు నుంచి కాస్త ఆసక్తికర పరిస్థితులే నెలకొన్నాయని చెప్పాలి.

ఈ సినిమాకి నమోదు అయ్యిన బుకింగ్స్ నుంచి ఆ టికెట్స్ కి సంబంధించి అనేక ట్రోల్స్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపించాయి. అయితే ఈ ట్రోల్స్ అన్ని ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు బాబు అతి వల్ల ఇతర కారణాల వల్లనే అని కొన్ని కారణాలు వినిపించాయి.

సరే ఇదంతా పక్కన పెడితే అసలు తమ సినిమాకి ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓ ఇద్దరు హీరోలు అని మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చెయ్యడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తనని ఈ సినిమాని కావాలనే ఓ ఇద్దరు హీరోలు టార్గెట్ చేసారని.. వారి వల్లే ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఇన్ని ట్రోల్స్ వస్తున్నాయని మోహన్ బాబు మండిపడ్డారట.

అంతే కాకుండా తాను సోషల్ మీడియాలో పెద్దగా ఉండకపోయినా ఈ విషయం మంచు విష్ణు, లక్ష్మి ల ద్వారా అతడికి తెలిసింది అని సినీ వర్గాల్లో టాక్ వైరల్ అవుతుంది. మరి ఆ హీరోలు ఎవరో తెలియాల్సి ఉంది.మొత్తానికి అయితే ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమా టాక్ అయితే బాగాలేదనే వినిపిస్తుంది.