షాకింగ్ : ట్రోల్స్ పై ఫస్ట్ టైం స్పందించిన రష్మికా మందన్న.!

సౌత్ ఇండియా సినిమా దగ్గర ఆనతి కాలంలోనే భారీ స్టార్డం తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రష్మికా మందన్నా. అయితే చిన్న సినిమాతోనే కెరీర్ ని స్టార్ట్ చేసినా ఆ తర్వాత టాలీవుడ్ లో లక్కీ ఛార్మ్ గా మారిన తాను నెక్స్ట్ ఇక భారీ ఆఫర్స్ పెద్ద హీరోలతో సినిమాల అవకాశాలు దక్కించుకొని పెద్ద స్టార్ అయ్యిపోయింది.

అయితే రష్మికా పై ఎంత క్రేజ్ ఉందో ఆమెపై అంతే స్థాయి ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. మరి అలా రష్మికా అయితే ఇప్పటి వరకు ట్రోల్స్ పై ఎప్పుడూ స్పందించలేదు కానీ మొదటి సారి రష్మికా ఈ ట్రోల్స్ పై చాలా ఎమోషనల్ గా మొట్ట మొదటిసారి స్పందించింది.

తన ఇన్స్టాగ్రామ్ లో పెద్ద పోస్ట్ నే తాను పెట్టగా దాని కోసం సింపుల్ గా చెప్పినట్టు అయితే తాను ఎప్పుడు ఈ ట్రోల్స్ కోసం పెద్దగా పట్టించుకునే దానిని కాదని నా పని నేను చేస్తా అందులో ఆనందం వెతుక్కుంటా అలాగే ఇతరులని మెప్పించాలని నా పనితో చూస్తా.

అంతే కానీ ట్రోల్ నాపై నెగిటివ్ వార్తలని పట్టించుకునేదానిని కాదు. నేను అందరికీ నచ్చాలని లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా మాటలు వేరే విధంగా మార్చి ప్రచారం చేస్తూ ఉండడం వాటి వల్ల నేను నా పై ప్రమేయం లేకుండా మార్చి చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది.

అందుకే ఇపుడు మాట్లాడాల్సి వచ్చింది అని అయినా నాకు ఇబ్బంది లేదు ఈ విమర్శల వల్ల నేను మరింత మెరుగవుతా అని చెప్పింది. అలాగే ఫైనల్ గా అయితే మరి మనమంతా అందరి పట్ల దయతో ఉందాం మన బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండమని రష్మికా తెలిపింది. దీనితో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.