Akhanda : షాకింగ్ న్యూస్ : బాలయ్య సినిమా చూస్తుండగా మరో పెను ప్రమాదం.!

Akhanda : ఇప్పుడు టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రం “అఖండ” విడుదల అయ్యి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను అలాగే నటసింహం బాలకృష్ణ ల హ్యాట్రిక్ మ్యాజిక్ మళ్లీ పని చేసి అఖండ విజయం సొంతం అయ్యింది. అయితే ఈ సినిమా థియేటర్లు లో ఎంత వినోదాన్ని ప్రేక్షకులకు ఇస్తుందో మరో పక్క అలాగే షాకులు కూడా ఇస్తుంది. మొన్ననే సినిమా చూస్తూ ఓ వ్యక్తి అకస్మాత్తుగా మరణించడం జరగగా అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

ఇక నిన్న మళ్లీ ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకే పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం లోని ఓ థియేటర్లో అఖండ సినిమా చూస్తుండగా ఆ థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ జరుగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయట. దీనితో థియేటర్ లో వీక్షకులు వెంటనే అప్రమత్తం అయ్యి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. మరి బాలయ్య సినిమా చూస్తుండగా ఇది మరో ప్రమాదం. సినిమా హిట్ అవ్వడం ఏమో కానీ ప్రేక్షకులకు ఇది డేంజర్ బెల్స్ లా మొగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే థమన్ ఈ సినిమాకి స్వరాలు అందించాడు.